Pithapuram | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై ఏపీ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఇద్దరూ కలిసి జగన్పై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. ప్రజల మనసు గెలిచిన నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. జనప్రభంజనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు సభలకు ఎక్కడా జనం రావడం లేదని విమర్శించారు. అదే జగన్ సభలకు ఎండ తీవ్రత లెక్క చేయకుండా వస్తున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబును జనం నమ్మే పరిస్థితిలోలేరని అన్నారు. పిఠాపురంలో గాజు గ్లాసు పగిలిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో జగన్ చూపించారని అన్నారు.
ఇద్దరు మోసగాళ్లు వెళ్లి ఢిల్లీ పార్టీతో కలిశారని జోగి రమేశ్ ఎద్దేవా చేశారు. విలువలు, విశ్వసనీయత వదిలేసి పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ-జనసేన అడ్రస్ గల్లంతే అని అన్నారు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోతున్నారని స్పష్టం చేశారు.