Padmavathi Express | తిరుపతి రైల్వే స్టేషన్లోని యార్డ్లో పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. దీంతో పద్మావతి, రాయలసీమ ఎక్స్ప్రెస్ను రీ షెడ్యూల్ చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు.
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన పద్మావతి ఎక్స్ప్రెస్ (12763) ను రీ షెడ్యూట్ చేశారు. సాయంత్రం 4.55 గంటలకు బయల్దేరాల్సిన పద్మావతి ఎక్స్ప్రెస్ రాత్రి 7?45 గంటలకు బయల్దేరనుంది. తిరుపతి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరాల్సిన తిరుపతి – నిజాముద్దీన్ – రాయలసీమ ఎక్స్ప్రెస్ రాత్రి 8 గంటలకు బయల్దేరనుంది. ఈ విషయాన్ని రైలు ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.
Rescheduling of Padmavti Express today
Train No. 12763 Tirupati – Secunderabad Express scheduled to depart Tirupati at 16.55 hrs today i.e., 19.07.2023 is rescheduled to depart at 19.45 hrs on the same day.@drmgtl
— South Central Railway (@SCRailwayIndia) July 19, 2023