అమరావతి : ఏపీ వైసీపీలో మరో వికెట్ పడింది. ఆ పార్టీకి చెందిన ఒంగోల్ వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Srinivasulu reddy) రాజీనామా చేశారు. 1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఒంగోలు ఎంపీ(Ongle MP) గా మాగుంట పోటీ చేసి విజయసాధించారు. 2014లో టీడీపీ తరుఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2017లో టీడీపీ ఎమ్మెల్సీగా గెలిచారు.
ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మాగుంట కుటుంబానికి ఆత్మగౌరవం ముఖ్యమని, ఆత్మగౌరవం దక్కని చోట పనిచేయడం వేస్టని భావించి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడుతున్నానని చెప్పారు. ఐదు సంవత్సరాల పాటు తనకు సహకరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. తన కుమారుడు రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరాతరన్న విషయాన్ని స్పష్టత ఇవ్వలేదు.