తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో వైకుంఠ క్యూకాంప్లెక్స్లోని 18 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 67,275 మంది భక్తులు దర్శించుకోగా 25,293 మంది తలనీలాలు సమర్పించారు . భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.07 కోట్లు వచ్చిందని తెలిపారు.