అమరావతి: పోలియో రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు గాను చేపడుతున్న పల్స్పోలియో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి నాలుగురోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 5 ఏండ్లలోపు ఉన్న చిన్నారులను గుర్తించిన ప్రభుత్వం వారికి పోలియో చుక్కలను సంబంధిత శాఖల సిబ్బందితో ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 52 లక్షల 93,832 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు 37,969 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1,51,876 మంది వ్యాక్సినేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తొలిరోజు ఎవరైనా చిన్నారులకు పోలియో చుక్కలను వేయించలేకపోతే వారికి సోమవారం నుంచి ఇంటింటికీ తిరిగి వేసేందుకు 75,938 బృందాలను ఏర్పాటు చేశారు. వైద్య, స్త్రీ శిశు సంక్షేమ, పురపాలక, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, రవాణా, విద్యా శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.