అమరావతి : కర్నూలు జిల్లాలోని తుంగభద్ర జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. 10 గేట్ల ద్వారా నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్రకు 53,666 క్యూసెక్కుల నీరు వస్తుండగా 40,786 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులకు గాను ప్రస్తుతం 1632 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది.
మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 1,39,685 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు.