అమరావతి : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది . జలాశయం నాలుగు గేట్లు 10 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 1.12 లక్షల క్యూసెక్కులు సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 2.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది . జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.90 అడుగుల వరకు నీరు ఉంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215.32 టీఎంసీలుగా ఉంది . శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలకు 63,089 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు.