తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని గత ఏడాది కోటి నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. డిసెంబర్ 30వ తేదీ వరకు నమోదైన వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి లడ్డూల విక్రయం ద్వారా రూ. 5.96 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు.
హుండీ కానుకల ద్వారా రూ. 833.41 కోట్లు , కోటీ 37 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని చెప్పారు. 48.75లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించారు.