తిరుమల: తిరుమల (Tirumala) మెట్లమార్గంలో చిరుత (Leopard) సంచారం మరోసారి కలకలం రేపింది. నడకదారిలో (Walkway) ఉన్న శ్రీ నరసింహ స్వామివారి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి కదలికలు రికార్డయ్యాయి. డిసెంబర్ 13, 26 తేదీల్లో ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగు కదలికలను అధికారులు గుర్తించారు. దీంతో టీటీడీ అప్రమత్తమయింది. తిరుమలకు నడకమార్గంలో వెళ్లే భక్తులకు పలు సూచనలు చేసింది. అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లాలని సూచించారు.
గతంలో అలిపిరి నడక మార్గంలో చిరుతలు సంచరించిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాకు కొవ్వూరుకు చెందిన బాలిక లక్షితపై దాడిచేసి చంపేసింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ.. అటవీశాఖ అధికారులతో కలిసి బోన్లు ఏర్పాటుచేసింది. ఐదు చిరుత పులులను బంధించించిది. దీంతో మెట్ల మార్గంలో పులుల బాధ తప్పిందని అనుకుంటుండగా.. మరోసారి చిరుత, ఎలుగును గుర్తించడంతో భక్తులు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు.