తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 6.06లక్షల మంది భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. భక్తులకు జనవరి 2 నుంచి 11 వ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనం కల్పించామని వెల్లడించారు. పది రోజుల హుండీ ఆదాయం రూ. 39.40కోట్లు ఆదాయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
శ్రీవారి లడ్డూ విక్రయాల ద్వారా రూ. 34.60లక్షలు ఆదాయం వచ్చిందన్నారు. డిసెంబర్లో శ్రీవారిని 20.25 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని వివరించారు. డిసెంబర్లో శ్రీవారి హుండీ కానుకలు రూ. 129.37 కోట్లు, లడ్డూ విక్రయాల ద్వారా రూ. 1.08 కోట్లు వచ్చిందన్నారు. ఈనెల 28న రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈవో పేర్కొన్నారు. సూర్యప్రభ నుంచి చంద్రప్రభ వాహనం వరకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.