తిరుమల : శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల(Brahmotsavam) సందర్భంగా తిరుమల వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి సోమవారం సాయంత్రం పట్టు వస్త్రాలు(Silk cloths) సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఈవోకు శ్రీశైలం ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఆలయ అధికారులు తీర్థ, ప్రసాదాలు అందించారు. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ(TTD) తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈనెల ఒకటిన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ఫార్పతేధార్ తులసీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు .