అమరావతి : ఒడిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 113 మంది ప్రయాణికుల ఆచూకీ తెలియ లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వారి వివరాలు సేకరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. వారి ఫోన్లు ఎత్తకపోవడమో, స్విచాఫ్ చేయడమో జరిగిందని తెలిపారు. వీరి ఫోన్ నెంబర్ల ద్వారా ట్రేస్ చేస్తున్నామని అన్నారు.
రైళ్ల దుర్ఘటనలో కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఏపీ ప్రయాణికులు 482 మందిలో 267 మంది క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. విశాఖలో దిగాల్సినవాళ్లు 309 మంది ప్రయాణికులున్నారని చెప్పారు. 82 మంది ప్రయాణం రద్దు చేసుకున్నారని తెలిపారు. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో ఏపీకి చెందిన 89 మంది ప్రయాణికులున్నారని వివరించారు. రైలు ప్రమాదంలో ఏపీ వాళ్లు చనిపోయినట్లుగా సమాచారం లేదన్నారు. మరో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన రైళ్లలో ప్రయాణించినవారి కుటుంబసభ్యులు హెల్ప్లైన్ను సంప్రదించాలని సూచించారు.