అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) ఇద్దరు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ (Avadhanam Hariharanatha Sharma) , డాక్టర్ యడవల్లి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ (CJ Deeraj Singh Tagore) ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన జడ్జిలను పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందించారు.
రాష్ట్ర హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 28 మంది పనిచేస్తున్నారు. ఇద్దరి నియమకంతో ఆ సంఖ్య 30కు చేరుకోంది. మరో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా , ఆతరువాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. ప్రకాశం జిల్లాకు చెందిన జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు , కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిగా హరిహరనాథ శర్మ పలు కోర్టుల్లో వివిధ సేవలను అందించారు.