అమరావతి: ఇప్పటికే ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్టీపీసీ షాక్ ఇచ్చింది. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న 2 వేల మెగావాట్ల విద్యుత్ను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) నిలిపివేసింది. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
దీంతో అప్రమత్తమైన రాష్ట్ర అధికారులు.. విద్యుత్ లోటును ఆర్టీపీసీ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు.
మరో యూనిట్ను ప్రారంభించాలని ఆదేశాలు జారీచేశారు. అయితే అదనపు విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి సరిపడా బొగ్గు నిల్వలు లేవని ఆర్టీపీసీ స్పష్టం చేసింది. దీంతో ఇందనశాఖ అధికారులు అయోమయంలో పడ్డారు. కాగా ప్రస్తుతం ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నట్టు తెలుస్తున్నది.
వేసవిలో అదనపు విద్యుత్ కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేసుకునేలా డిస్కంలకు ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల నుంచి మే 22 వ తేదీ వరకు స్వల్పకాలిక పద్ధతిన అదనపు విద్యుత్ కొనుగోళ్లకు ఈఆర్సీ అనుమతించింది.