తిరుపతి: అమెరికాకు చెందిన ప్రవాస భారతీయులు చంద్రశేఖర్ ఎస్వీబీసీ (SVBC) ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. ఆయన తరుఫున వై.రాఘవేంద్ర తిరుపతిలోని టీటీడీ(TTD) పరిపాలన భవనంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి డీడీని అందజేశారు. తెలుగు రాష్ట్రాలకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు.
టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి(Sarvadarsan) 24 గంటల సమయం పడుతోందని అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. శనివారం శ్రీవారిని 76,104 మంది భక్తులు దర్శించుకోగా 32,412 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం ( Hundi Income) రూ. 2.92 కోట్లు వచ్చిందని వివరించారు.