అమరావతి : కరోనా బాధితులకు తాను పంపిణీ చేస్తున్న ఆయుర్వేద ఔషధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. నేటి నుంచి మందు పంపిణీ జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో నిజంలేదని ఆయన పేర్కొన్నారు. ఔషధ తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు సిద్ధంగా లేవని చెప్పారు.
వదంతులు నమ్మి ఎవరూ కృష్ణపట్నానికి రావద్దని కోరారు. ఇదిలాఉండగా ఆనందయ్య ఇస్తున్న మందులో ఎలాంటి హానికర పదార్ధాలు లేవని ఆయూష్ అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పడంతో అనుమతి ఎప్పుడు వస్తుందా అని అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆనందయ్య మందుపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.