అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూ కబ్జాలు తప్ప మరేం చేయలేదని బీజీపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. వైసీపీ నాయకులు భూ కబ్జాలు తప్పా విశాఖ అభివృద్ధికి ఏమి చేయలేదని విమర్శించారు. విశాఖ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటుందని మంత్రి బొత్స సత్య నారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న విశాఖను కూడా తమ కబ్జాలోకి తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారని విమర్శించారు. రుషికొండలో చేపడుతున్న నిర్మాణాల సంగతి ప్రభుత్వం వెల్లడించకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రజల భూములు నిషేధిత జాబితాలో పెట్టడం మరీ దారుణమని అన్నారు. రాష్ట్కంలో రుణ యాప్ల వల్ల జరుగుతున్న దారుణాలను అడ్డుకోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని కనబరచడం లేదని విమర్శించారు.