గరిడేపల్లి/పెన్పహాడ్, మే 21 : ఇంటింటి జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పద్మజారాణి అన్నారు. గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లిలో నిర్వహించిన సర్వేను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటినీ తప్పకుండా సర్వే చేయాలన్నారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే వెంటనే కిట్లు అందజేయాలన్నారు. కరోనా నియంత్రణఖు ప్రతి ఒక్కరూ తప్పక మాస్క్లు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆమె వెంట ఇన్చార్జి ఎంపీడీఓ వనజ, పంచాయతీ కార్యదర్శి జక్కి అంజయ్య, ఏఎన్ఎం ప్రమీల, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. అలాగే పెన్పహాడ్ మండలంలోని అనంతారం, మాచారం, దూపాడ్లో ఇంటింటి సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా అనుమానితులు హోం ఐసొలేషన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. తాసీల్దార్ శేషగిరిరావు, ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచులు బైరెడ్డి శ్రీనివాస్రెడ్డి, బిట్టు నాగేశ్వర్రావు, బొల్లక సైదమ్మ, బొబ్బయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సర్వేను తనిఖీ చేసిన జడ్పీ సీఈఓ
మోతె : మండలంలోని రాఘవాపురం ఎక్స్రోడ్డులో నిర్వహించిన జ్వర సర్వేను జడ్పీ సీఈఓ ప్రేమ్కిరణ్రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. కరోనా లక్షణాలున్న వ్యక్తులను గుర్తించి వారికి మందులు పంపిణీ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామంల్లో వైద్య సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారా? లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ శంకర్రెడ్డి, సర్పంచ్ మామిడి స్వాతీనాగార్జున, ఏపీఓ వెంకన్న, గ్రామపంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది ఉన్నారు.
ప్రజలు సర్వేకు సహకరించాలి : సుధీర్చక్రవర్తి
ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని కాపుగల్లు పీహెచ్సీ వైద్యుడు డా॥ సుధీర్చక్రవర్తి కోరారు. శుక్రవారం కాపుగల్లులో నిర్వహించిన ఇంటింటి సర్వేలో ఆయన పాల్గొని కరోనా లక్షణాలున్న వారికి మందులు అందించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. హోం ఐసొలేషన్లో ఉన్నవారు వైద్యులు సలహాలు పాటించాలని సూచించారు. అత్యవరసర సమయంలో 8186013134 నంబర్కు ఫోన్చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కోదాడలో 4750 కుటుంబాల సర్వే
పట్టణంలోని 31వ వార్డులో నిర్వహించిన జ్వర సర్వేను మున్సిపల్ మేనేజర్ అంకుశావలీ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35సర్వే బృందాలు 4750 కుటుంబాలను సర్వే చేసి కరోనా లక్షణాలున్న 11మందిని గుర్తించినట్లు తెలిపారు. వారికి వెంటనే మెడికల్ కిట్లు అందజేసినట్లు చెప్పారు. సర్వేలో వార్డు అధికారి తనీశ్, ఆర్పీలు దేవి, అనిత, మున్సిపల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బొత్తలపాలెంలో ఇంటింటి సర్వే..
పాలకవీడు : మండలంలోని బొత్తలపాలెంలో శుక్రవారం ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. ఏఎన్ఎం నాగేంద్ర మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటినీ సర్వే చేసినట్లు తెలిపారు. కరోనా లక్షణాలున్న వారికి మెడికల్ కిట్లు అందించి హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బ్రహ్మారెడ్డి, అంగన్వాడీ టీచర్లు ప్రేమలత, జానకమ్మ, ఆశ కార్యకర్తలు నాగసుకన్య, జ్యోతి, యల్లమ్మ పాల్గొన్నారు.
మెడికల్ కిట్లను వినియోగించుకోవాలి
తుంగతుర్తి : జ్వర లక్షణాలున్న ప్రతి ఒక్కరూ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలని హెచ్ఈఓ సముద్రాల సూరి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఇంటింటి సర్వేలో భాగంగా కరోనా బాధిత కుటుంబాలను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆరోగ్య సిబ్బంది గాజుల సోమయ్య, నర్సింహాచారి, ఏఎన్ఎం జానకి, భారతి, రేణుక ఉన్నారు.