అమరావతి : కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో తీసుకున్న నైట్ కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. పండుగ తరువాత ఈనెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని తాజాగా వెల్లడించింది. ఏపీ ప్రజలకు అతి పెద్ద పండుగల్లో ఒకటైనా సంక్రాంతి పండుగకు సొంత స్థలాలకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని, ఇందు కోసం ప్రయాణాలు ఎక్కువగా రాత్రివేళల్లోనే ఎక్కువగా సాగే అవకాశాలుండడంతో నైట్కర్ఫ్యూను ప్రభుత్వం వాయిదా వేసుకుంది.
ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కర్ఫ్యూను సంక్రాంతి తర్వాత నుంచి అమల్లోకి తీసుకు రావాలని నిర్ణయించింది .