అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 13,474 కరోనా కేసులు నమోదయ్యాయి . మనో 9 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం లక్షా 9,493 యాక్టివ్కేసులున్నాయని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 41,771 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13,474 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది .
కర్నూలు జిల్లాలో 1,835 , విశాఖలో 1,349, గుంటూరు జిల్లాలో 1,342, ప్రకాశం జిల్లాలో 1,259 అత్యధికంగా కేసులు నమోదయ్యాయి . తూర్పు గోదావరిలో 1,066, నెల్లూరు జిల్లాలో 1,007 కేసులు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు.