హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగుతున్న జవహర్ రెడ్డిని బదిలీ చేసింది. 1987 బ్యాచ్కు చెందిన నీరభ్కుమార్ ప్రసాద్.. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇప్పటిరకు సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఆయన జూన్ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తన టీంపై ఆయన ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు. ఇక మంత్రివర్గంలోకి ఎవరెవరని తీసుకోవాలనే విషయంమై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి.