హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఏపీలోని విశాఖపట్నంలో నౌకాదళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ విజయానికి ప్రతీకగా ప్రతి ఏటా డిసెంబర్ 4 నుంచి నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మిగ్జామ్ తుఫాను కారణంగా 4న జరగాల్సిన వేడుకలను 10కి వాయిదా వేశారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ఈ కార్యక్రమానికి వేదికైంది. దీనికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, తూర్పు నౌకాదళ చీఫ్ వైస్ ఆడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్ హాజరయ్యారు.
తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. నేవీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సబ్ మెరైన్స్, హెలికాఫ్టర్లతో సిబ్బంది ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 2 వేల మంది నౌకాదళ సిబ్బంది విన్యాసాల్లో పాలుపంచుకున్నారు. వేలాదిగా ప్ర జలు ప్రత్యక్షంగా తిలకించారు. అనంతరం తేనీటి విందుకు గవర్నర్ హాజరయ్యారు.