అమరావతి : ఆంధ్రప్రదేశ్ హోంశాఖ కార్యదర్శితోపాటు డీజీపీ గౌతమ్ సవాంగ్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ ( (ఎన్హెచ్ఆర్సీ) ఇవాళ సమన్లు జారీ చేసింది. రఘురామ అరెస్టుపై నివేదిక పంపాలని గతంలో ఎన్హెచ్ఆర్సీ వీరికి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు స్పందించకపోవడంపై ఎన్హెచ్ఆర్సీ అసహనం వ్యక్తం చేస్తూ వీరిద్దరికీ ఇవాళ కండిషనల్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 9లోగా నివేదిక ఇవ్వాలని ఇందులో పేర్కొంది. గడువులోగా నివేదించకపోతే వ్యక్తిగతంగా హాజరుకావాలని హెచ్చరించింది. నివేదిక ఇవ్వకపోతే ఆగస్టు 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించింది.