హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘నాలుగేండ్ల నరకం’ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.
శాంతిభద్రతలు క్షీణించాయని గణాంకాలతో సహా పోస్టర్లు ముద్రించారు. గుంటూ రు, విజయవాడ ప్రభుత్వ దవాఖానలు, ఒంగోలు రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు.