అమరావతి : దివంగత నేత , మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ నివాళి అర్పించారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి నిర్మల్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రార్థనలు చేశారు.
జగన్ మాట్లాడుతూ నాన్న భౌతికంగా దూరమైనా ఆయన జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయని, తాను వేసే ప్రతి అడుగులో నాన్నే స్ఫూర్తిగా ఇకపైనా ప్రభుత్వం అడుగులు వేస్తుందని పేర్నొన్నారు. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని చాటి చెప్పారని తెలిపారు. వైసీపీ కేంద్రకార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి , మంత్రి జోగు రమేశ్, మహిళా హక్కుల కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తదతరులు నివాళి అర్పించారు.