అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ స్వార్థం కోసమే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ముర్ముకు మద్దతు ఇస్తున్నాయని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. సామాజిక న్యాయం పేరిట అవాస్తవాలు ఆడుతున్నాయని విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశం లో మాట్లాడారు. 2012లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణభ్ ముఖర్జి, గిరిజన అభ్యర్థి పీఏ సంగ్మా పోటీ చేయగా వైఎస్ జగన్ ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చారని తెలిపారు.
గిరిజనుడైన సంగ్మాకు మద్దతు ఇవ్వకుండా టీడీపీ ఎన్నికలను బహిష్కరించిందని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టాయని అన్నారు. ఏపీకి మొదటి ద్రోహి బీజేపీ అయితే ఈ పార్టీకి మద్దతు ఇస్తున్న వైసీపీ, టీడీపీలు మరింత ద్రోహులని ఆరోపించారు.