కడప సెంట్రల్ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీ రాజశేఖర్ పరారయ్యాడు అనారోగ్య కారణాల వల్ల ఏప్రిల్ నెలలో విశాఖ మానసిక ఆస్పత్రికి తరలించి, తిరిగి జైలుకు తరలిస్తుండగా గూడూరు రైల్వే స్టేషన్లో తప్పించుకుని పారిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని కాచిగూడకు చెందిన రాజశేఖర్ కొంతకాలం కిందట నంద్యాలకు వచ్చాడు. పట్టణంలోని రౌడీషీటర్లతో పరిచయాలు పెంచుకుని పలు దందాలు చేశాడు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో అతనిపై పోక్సో కేసు కూడా నమోదైంది. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్కు కొంతకాలం కిందట జీవితఖైదు పడింది. ఈ క్రమంలో కడప సెంట్రల్ జైలులో అతను శిక్ష అనుభవిస్తున్నాడు.
రాజశేఖర్ మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తుండటంతో జైలు అధికారులు చికిత్స నిమిత్తం అతన్ని విశాఖపట్నంలోని మెంటల్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందిన రాజశేఖర్నున వైజాగ్ నుంచి కడపకు తరలిస్తుండగా గూడూరు రైల్వే స్టేషన్లో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని పారిపోయాడు. అతను నంద్యాలకు వచ్చి ఉంటాడేమోనన్న అనుమానంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.