అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని లో నగరపాలక, పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు (Counting) కొనసాగుతున్నది. వివిధ కారనాల వల్ల నిలిచిపోయిన నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు సోమవారం జరిగాయి. ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయింది. మొత్తం 353 డిజిన్లు లేదా వార్డు స్థానాల్లో 28 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 325 స్థానల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 1206 మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు. వీరి భవితవ్యం మరికాసేపట్లో తేలనుంది.
కాగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వస్థలమైన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్కడ మొత్తం 25 వార్డులకు గానూ 24 వార్డుల ఓట్ల లెక్కింపు జరుతున్నది. ఇప్పటికే ఒక వార్డు ఏకగ్రీవమైంది. అక్కడ వైసీపీ అభ్యర్థి ఎన్నికలేకుండా విజయం సాధించారు. కుప్పంలోని ఎంఎఫ్సీ ఒకేషనల్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మున్సిపాలిటీలో మొత్తం 37,664 ఓట్లకుగాను 28,942 ఓట్లు పోలయ్యాయి.