అమరావతి, జూన్12:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ‘అమరావతి పేరుతో దేశంలో చాలా పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. వాళ్లంతా బాబు రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతికి మద్దతివ్వాలట! ఎల్లో మీడియా ఆ పనిలో పడింది. రాజధాని పేరుతో లక్షల కోట్ల దోపిడీకి స్కెచ్ వేసిన బాబుకు కిరాయి ఉద్యమాన్ని ఎటు తీసుకుపోవాలో అంతుబట్టడం లేదు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్టర్ లో పేర్కొన్నారు.