అమరావతి : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టులో ఈ ఉదయం 11 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు ఉన్న న్యాయమూర్తి విచారణను 12 గంటలకు వాయిదా వేశారు. పిటిషనర్ తరుఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాఘురామను అరెస్టు చేసిన తీరును కోర్టుకు ముకుల్ రోహత్గి వివరించారు. రఘురామ కేసు విషయంలో కింది కోర్టు ఆదేశాలను సీఐడీ అధికారులు ఏమాత్రం పట్టుకోలేదని న్యాయస్థానానికి విన్నవించారు.
కేవలం బెయిల్ రాకూడనే ఉద్దేశంలోనే రఘురామపై సెక్షన్ 124(ఏ) కింద కేసు నమోదు చేశారని వివరించారు. ‘‘ఎవరూ ఫిర్యాదు చేయకుండానే అదనపు డీజీ ఉద్దేశపూర్వకంగా విచారణకు ఆదేశించారు. విచారణ ఆధారంగా రఘురామపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుంటూరుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే అక్కడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కస్టడీలో రఘురామను తీవ్రంగా కొట్టి, హింసించారు. అరికాళ్లకు తగిలిన గాయాలను ఎంపీ మెజిస్ట్రేట్కు చూపారు’’ అని ముకుల్ రోహత్గి కోర్టుకు విన్నవించారు. రఘురామకు బెయిల్ మంజూరు చేసి ప్రైవేట్ దవాఖానలో వైద్యం చేయించుకునేలా అనుమతి ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.