అమరావతి : వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి( YS Avinash Reddy) బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంకోర్టు ( Supreme Court ) లో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ కేసు పలుమార్లు విచారణకు వచ్చి వాయిదా పడుతూ వస్తుంది.
సోమవారం కూడా విచారణ జరగాల్సి ఉండగా సునీతా వేసిన కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా (Siddarth Luthra) ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్టు ( Chandra babu ) విషయంలో ఏపీలో ఉండడంతో అవినాష్రెడ్డి బెయిల్ రద్దుపై విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు అనుమతి ఇచ్చిన సుప్రీం కోర్టు కేసును మూడు వారాలకు వాయిదా వేస్తు నిర్ణయం తీసుకుంది.