అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో విషాద ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి తల్లీకుమార్తె మృతి చెందారు. కంబదూరు మండలం అచ్చంపల్లిలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సాయంతో మరో కుమార్తె బయటపడింది. తల్లీకుమార్తె ఒకేసారి మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.