అమరావతి : ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురిసింది. నందవరం, పెద్దకడుబూరు, కృష్ణగిరి, సి.బెళగల్, కౌతాళం మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది. ఉదయం సాధారణ వాతావరణమే ఉన్నా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం పడింది.
కల్లాలపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. అకాల వర్షం కారణంగా మెట్ట పంటలకు నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోయారు. సోమవారం సైతం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో మేకలు కాసేందుకు వెళ్లిన తండ్రీకుమార్తె పిడుగుపాటుకు మృతి చెందిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.