AP News | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన ఆప్షనల్ హాలీడేకు బదులు సాధారణ సెలవుగా మార్పు చేసింది. దీంతో ఈనెల 23, 24 తేదీల్లో సాధారణ సెలవులు ఉండనున్నాయి. ఈనెల 24న విజయదశమి దృష్ట్యా సెలవులో ప్రభుత్వం ఈ మేరకు మార్పు చేసింది.