అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు, రైతాంగం పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రస్తుతానికి చెన్నైకు 670 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో వచ్చే 48 గంటల్లో వాయుగుండం తమిళనాడు నుంచి దక్షిణ కోస్తాంద్ర వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది.
దీని వల్ల సోమ, మంగళవారాల్లో ప్రకాశం,నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది . దక్షిణాకోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు విపత్తులసంస్థ హెచ్చరికలు జారీ చేసింది .