అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. రాత్రివేళల్లో కర్ఫ్యూను ప్రకటించిన ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విద్యాలయాలు, హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేస్తుంది. తాజాగా కర్నూలు జిల్లాలో మెడికల్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు కరోనా బారిన పడడంతో హాస్టళ్లను మూసివేస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రకటించారు. ఈనెల 17 వరకు ముందు జాగ్రత్తగా హాస్టళ్లను మూసివేస్తు్న్నట్లు ఆయన వెల్లడించారు.
కొవిడ్, ఒమిక్రాన్ కొరలు చాస్తున్న నేపథ్యంలో ఏపీలోని పలు ఆలయాల పాలక మండళ్లు సైతం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు సింహాద్రి అప్పన్న అంతరాలయ దర్శనాలను ఈ రోజు రద్దు చేశారు. భక్తులకు ప్యాకెట్ల రూపంలో అన్న ప్రసాదాన్ని అందజేశారు.