అమరావతి : మణిపూర్లో జరుగుతున్న అసాధారణ ఘటనలతో ఏపీ విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం(AP Government) చర్యలు ప్రారంభించింది. దాదాపు 150 మంది ఏపీ విద్యార్థులు నీట్లో చదువుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీరిని స్వరాష్ట్రానికి తరలించేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రితో ఏపీ అధికారులు జరిపిన చర్చల్లో అంగీకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేక విమానం ఎన్ని గంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారం త్వరలోనే ఇస్తామని అధికారులు తెలియజేశారు.
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ(AP Minister Botsa Satyanarayana) మాట్లాడుతూ..ఏపీ విద్యార్థుల కోసం హెల్ప్ లైన్లు(Helplines) ఏర్పాటు చేశామని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురికావద్దని కోరారు. ఇప్పటికే వందమంది తెలుగు విద్యార్థుల వివరాలు సేకరించామని పేర్కొన్నారు. వివరాలు నమోదు చేసుకున్న వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొత్తం 150 మందిని తీసుకొచ్చేందుకు విమానం ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
పర్యవేక్షణ కోసం ఐఏఎస్లను నియమించామని ఆయన వెల్లడించారు. ఏపీ భవన్ కమిషనర్ హిమాన్సు కౌశిక్ కాంట్రాక్ట్ నంబర్ 88009 25668, ఏపీ భవన్ ఓఎస్డీ రవిశంకర్ కాంట్రాక్ట్ నంబర్ 91871 99905 లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.