అమరావతి : ఎమ్మార్పీయస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ( Chandra Babu) ను ఆదివారం విజయవాడలోని ఉండవల్లి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఏపీలో రాజకీయ పరిణామాలు (AP Politics) , పరిస్థితులపై చర్చించుకున్నారు.
ఎన్డీయేలో టీడీపీ చేరికతో ఏపీలో కూటమికి మద్దతివ్వాలని ఆయన తీసుకున్న నిర్ణయం మేరకు చంద్రబాబును కలవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు ప్రత్యామ్నాయం చూడాలని బాబును ఆయన కోరారు. అనంతరం మాదిగల అభ్యున్నతికి సహకరించాలని చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మాదిగల ఆకాంక్షలను చంద్రబాబు ముందు పెట్టామని, టీడీపీ, బీజేపీ(BJP), జనసేన(Janasena) కూటమి రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక మొదటి ప్రాధాన్యతలో అవన్నీ నెరవేరుస్తానని, కూటమి అధికారంలోకి రాగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణకు అనుకూలంగా బిల్లు పెడతామని హామీ ఇచ్చారని తెలిపారు.