ప్రకాశం : (Maha Padayatra) రాజధానిగా అమరావతినే కొనసాగించి తమకు న్యాయం చేయాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఎనిమిదో రోజుకు చేరింది. కార్తీక సోమవారం కావడంతో పాదయాత్రలో పాల్గొన్న మహిళలు.. ప్రభుత్వానికి సద్బుద్ధి కలిగించాలని శంకరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఎనిమిదో రోజు పాదయాత్ర ఇంకొల్లు నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో రైతులకు సంఘీభావంగా మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కార్తీక సోమవారం కావడంతో మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకొల్లులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రథం వద్ద ముగ్గులు వేశారు. ధూప, దీప, నైవేధ్యాలతో పూజలు చేశారు. అమరావతి రాజధానిని సాధిద్దామంటూ భజనలు చేశారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి, రైతులు చేపట్టిన మహాపాదయాత్ర విజయవంతంగా పూర్తికావాలని కోరుతూ మహిళా జేఏసీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించేలా ముఖ్యమంత్రి జగన్కు పరమేశ్వరుడు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నట్టు మహిళా జేఏసీ నేతలు తెలిపారు. రైతులు మహా పాదయాత్రను ప్రజలు ఘనంగా పూలు చల్లి స్వాగతిస్తుంటే.. ప్రభుత్వం మాత్రం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదని వారు విమర్శించారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, అవమానాలు ఎదురైనా అమరావతిని రాజధానిగా కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని వారు పేర్కొన్నారు.
అక్కడ మొబైల్స్ కొట్టేస్తున్నరు.. ఇక్కడ అమ్మేస్తున్నరు..
5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..