అమరావతి : అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన జాతీయ గిరిజన నృత్య మహోత్సవాల్లో మధ్యప్రదేశ్ జట్టు ప్రథం స్థానం సాధించింది. బీచ్రోడ్డులోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అత్యుత్తమ నృత్య ప్రదర్శనలు ఇచ్చిన మధ్యప్రదేశ్ జట్టుకు ప్రథమ బహుమతిగా రూ. లక్ష నగదును అందజేశారు .
ద్వితీయ బహుమతిగా కర్ణాటకకు రూ. 75 వేలు తృతీయ బహుమతిగా ఒడిశాలకు రూ. 50 వేలు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, విశాఖ పట్నం కలెక్టర్ డాక్టర్ మల్లికార్జునతో పాటు పలువురు అందజేశారు. దేశంలోని 14 రాష్ట్రాల నుంచి గిరిజన సాంస్కృతిక బృందాలు నృత్యోత్సవంలో పాల్గొన్నాయి.