తిరుపతి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలోని (Tirupati) రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ (Machilipatnam express) రైలు.. యార్డులో నుంచి ప్లాట్ఫామ్ పైకి వస్తుండగా పట్టాలు తప్పింది. అయితే అందులో ప్రయాణికులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలు పట్టాలు తప్పడంతో స్టేషన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు తక్షణమే స్పందించి పట్టాలపైనుంచి పక్కకు జరిగిన బోగీలను సరిచేశారు. అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
కలియగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతున్నది. మంగళవారం స్వామివారిని 67,681 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.4.54 కోట్ల ఆదాయం వచ్చింది.