అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద మాచర్ల నుంచి భీమవరం వెళ్తుండగా నాపరాళ్లతో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. లారీపై కూర్చున ముగ్గురు కూలీలపై నాపరాళ్లు మీదపడి చనిపోయారు.
మృతులు రెంట చింత మండలం పశర్లపాడు వాసులు శ్రీను, భాస్కర్, మునినాయక్గా గుర్తించారు. డ్రైవర్ సైదులు, క్లీనర్ ఏసుకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.