అమరావతి : గుంటూరు జిల్లా నకరికల్లు మండలం దేచవరం మిద్ద సమీపంలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుకనుంచి వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొట్టింది. ఆటోలో ఉన్న మొగిలి వెంకటేశ్వర్లు, రాగిడి ఆదినారాయణ మృతి చెందారు.
మరో ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.