అమరావతి : ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై విచారణ జరిపించాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్ సారా మరణాలు కావని సహజ మరణాలని వ్యాఖ్యనించడం పద్దతి కాదని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే హక్కుల గురించి ఎం దుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ తప్పదని తేల్చి చెప్పినా కేంద్రంపై ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.
జగన్ ప్రభుత్వాన్ని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని వ్యాఖ్యనించారు. నిరంకుశ విధానాలతో ఏపీలో పరిపాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. బీజేపీ అనుకూలంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న మోసాలపై స్పందించకపోవడం విచారకరమని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అటకెక్కిందని విమర్శించారు.