(Lati Charge @ AP) ఒంగోలు : అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఉద్రిక్తతంగా మారింది. రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఓ రైతు చేయి విరిగింది. రైతులపై పోలీసులు లాఠీలు ఎక్కుపెట్టడంతో పాదయాత్రలో పాల్గొన్న మహిళలు పలువురు తోపులాటలో కిందపడిపోయారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, రైతులు.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రైతులు చేపట్టిన పాదయాత్ర ఇవాల్టికి 11 వ రోజుకు చేరింది. ఇవాళ ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు నుంచి ముక్తినూతలపాడు వరకు కొనసాగనున్నది. పాదయాత్రలో పాల్గొనకుండా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావును పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.
చదలవాడలో కొనసాగుతున్న రైతుల మహా పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొన్నది. రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగి.. సంతనూతలపాడుకు చెందిన రైతు నాగార్జున చేయి విరిగింది. ఉద్రిక్తతల నేపథ్యంలో పాదయాత్రకు అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. యాత్రలో పాల్గొనేందుకు వస్తున్న వివిధ గ్రామాల ప్రజలను కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. గ్రామాల నుంచి ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులు రోడ్లు దిగ్బంధించారు. పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
ఓ వైపు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తుండగా.. మరోవైపు జోరుగా వర్షం కురుస్తున్నది. అయినా వెరవకుండా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. గొడుగులు, రెయిన్కోట్లు ధరించి ముందుకు సాగుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నదంటూ నాగులుప్పలపాడు వెళ్లే రోడ్లను పోలీసులు దిగ్బంధించారు.
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..