హైదరాబాద్ : కృష్ణానదీ బోర్డు ప్రతినిధి బృందం రేపటి తమ రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన పర్యటనను వాయిదా వేసుకుంది. పోతిరెడ్డిపాడు వద్ద చేపట్టిన ఎత్తిపోతల పనులను బోర్డు ప్రతినిధులు గురువారం పరిశీలించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల బోర్డు ఏపీ ప్రభుత్వానికి సైతం సమాచారం ఇచ్చింది. కాగా జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ ప్రతినిధులు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. తదుపరి పరిశీలన తేదీని త్వరలో ప్రకటిస్తామని కేఆర్ఎంబీ తెలిపింది. గతంలో కేఆర్ఎంబీ ప్రతినిధులు రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శనకు వస్తామన్నా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.