తిరుపతి : తిరుపతి(Tirupati) శ్రీ కోదండరామాలయంలో మార్చి 20 నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల(Brahmotsavam) ను అన్ని విభాగాల అధికారులు సమష్టిగా కృషిచేసి విజయవంతం చేయాలని టీటీడీ జేఈవో(ttd JEO) వీరబ్రహ్మం కోరారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మార్చి 20న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు .
ప్రధానంగా మార్చి 22న ఉగాది(Ugadi) ఆస్థానం, 24న గరుడ సేవ(Garuda seva), 25న హనుమంత వాహనం జరుగుతాయన్నారు. మార్చి 31న శ్రీ సీతారాముల కల్యాణం, మార్చి 30 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు శ్రీరామనవమి(Srirama navami) ఉత్సవాలు, ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు తెప్పోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని వెల్లడించారు. ఆలయం వద్ద, వాహన సేవల్లో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.
బ్రహ్మోత్సవాల గురించి వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. మెరుగైన పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఎస్ఇ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి, డిప్యూటీ ఈవోలు గోవిందరాజన్, లోకనాథం, శాంతి, ఆలయ అర్చకులు ఆనంద కుమార దీక్షితులు పాల్గొన్నారు.