హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి, ఏపీ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు. బీజేపీకి రాజీనామాకు ముందే టీడీపీ నాయకత్వంతో చర్చలు జరిపినట్టు సమాచారం. తొలుత ఆయన జనసేనలోకి వెళ్లాలని భావించారు. కానీ జనసేనకు బీజేపీతో పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో కన్నాను చేర్చుకోవడం సరికాదని పవన్కల్యాణ్ పేర్కొన్నట్టు తెలిసింది.