అమరావతి : జనసేన పార్టీ విజయవాడ నాయకుడు పోతిన మహేశ్ (Pothina Mahesh) వైసీపీ నుంచి ప్యాకేజీ తీసుకుని కోవర్టుగా మారారని ఆ పార్టీ ఆంధ్రా జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆరోపించారు. జనసేన (Janasena) ను సర్వనాశనం చేసిన వ్యక్తి అని మండిపడ్డారు. పోతిన మహేశ్ జనసేన పార్టీకి సోమవారం రాజీనామా చేసి పవన్కల్యాణ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఈ ఆరోపణలను ఖండిస్తూ విజయవాడలో శంకర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
వైసీపీ విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని నాని (Kesineni Nani) తో లోపాయికారి ఒప్పందం చేసుకుని కోవర్టుగా మారారని వెల్లడించారు. పోతిన రాజీనామాతో జనసేనకు పట్టిన దరిద్రం పోయిందని పేర్కొన్నారు. గుంటూరు, విశాఖల్లో కార్పొరేటర్లు గెలిచినా జనసేన విజయవాడలో ఓడిపోవడానికి మహేశ్ కారణమని ఆరోపించారు. జనసేన జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు.