హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్కల్యా ణ్ ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో గురువారం ఆయన ము లాఖాత్ అయ్యారు. అనంతరం జైలు బయట హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ ప్ర ధాన కార్యదర్శి లోకేశ్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. వైసీపీపై విమర్శలు కురిపించిన పవన్.. పోలీసులు జగన్కు బానిసలుగా మారిపోయారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీపీ, సీఎస్ సహా ఎవరిపైనైనా పాత కేసులు తిరగదోడుతామని హెచ్చరించారు. టీడీపీ, జనసేన పొత్తుపై వైసీపీ విమర్శలు చేసింది. టీడీపీ-జనసేనల మధ్య పార్టీల ముసుగు తొలగిపోయి, ప్యాకేజీ బంధం బయటపడిందని ఆరోపించింది.